వచన కావ్యం భక్తిప్రపత్తులతో తనను స్మరించే ప్రతీ జీవికి ముక్తిమార్గాన్ని ప్రసాదించే పరబ్రహ్మమే మహాశివుడు. ధ్యానయోగమే ముక్తికి రాజమార్గంగా తెలియజేసి, తాను ధ్యానయోగంలో లయించి బోధించే పరమగురువు మహాశివుడు. అట్టి పరమశివుని వర్ణనతో కూడినదే శివమహాపురాణం. సర్వవ్యాపకుడు, సర్వాధరుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మవిష్ణ్వాది దేవతలచే కీర్తించబడ్డ శంకరుని లీలామహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివమహాపురాణం. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనామార్గాన్ని ప్రతిపాదిస్తుంది. Our other books here can be searched using #RKMathHyderabad